calender_icon.png 11 October, 2024 | 12:45 AM

లారీ ఢీకొని గొర్రెలు మృతి

10-10-2024 10:10:33 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): లారీ ఢీకొని 70 గొర్రెలు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండలంలోని గోపులపూర్ దగ్గర చోటుచేసుకుంది. గొర్రెల కాపరులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన  వెంకటయ్య, పోలయ్య అనే గొర్ల కాపరులు  జడ్చర్ల దగ్గర ఉన్న తమ  400 గొర్రెలను తీసుకొని  వారి గ్రామానికి వెళుతుండగా దేవరకద్ర మండలం గోపులాపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్ రాయచూర్ వెళ్తున్న రోడ్డుపై వెళుతున్నటువంటి గొర్రెల పై ఒక్కసారిగా లారీ ఎక్కించాడు. దాదాపు 70 గోర్లు మృతి చెందిన మృతి చెందాయి దీంతో లారీ డ్రైవర్  లారీని గొర్రెలపై యధావిధిగా నిలిపి అక్కడే లారీని వదిలిపెట్టి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు దీంతో రోడ్డుపై అటు ఇటు దాదాపు అర్ధగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీని పక్కకు తీసి ట్రాఫిక్ లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.