ప్రియుళ్ల మోజులో పెళ్లున నెల రోజులకే ఘాతుకం
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పెళ్లున నెల రోజులకే ప్రియుళ్ల మోజులో పడి భర్తను హత మార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించింది ఓ భార్య. నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రంలోని బీసీ కాలనీకి చెందిన సా యి(25)కి నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన నంది నితో వివాహం జరిగింది.
పెండ్లి అయిన మరుసటి రోజు నుంచే గొడవలు పడుతుండటంతో సాయికి అనుమానం వచ్చింది. నందిని ఫోన్ ఛాటింగ్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్లను పరిశీలించాడు. మరో ఇద్దరి యువ కులతో చనువుగా ఉంటున్నట్లు గుర్తి ంచి తోటి స్నేహితుల వద్ద విష యాన్ని పంచుకున్నాడు.
తీరా మంగ ళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు విషయం బయటకు రావడంతో అ ందరు నివ్వెరపోయారు. మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు నందిని నమ్మించింది. కాగా మృతదే హంపై గాయాలు కన్పించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుపు తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.