ఆది సాయికుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘షణ్ముఖ’. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. సాప్బ్రో ప్రొడక్షన్స్ సంస్థలో రెండో చిత్రంగా రూపొందిన ఈ సినిమాను తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకొంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. అద్భుతమైన గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రా హైలైట్గా ఉంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపింది చిత్రబృందం.