పాన్ ఇండియా సూపర్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘షణ్ముఖ’. ఇందులో ఆది సాయికుమార్ కథానాయకుడు కాగా, అవికాగోర్ కథానాయిక. షణ్ముగం సాప్పని దర్శకత్వంలో సాప్బ్రో ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఈ ద్వితీయ చిత్రమిది. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకొంటోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.