calender_icon.png 24 October, 2024 | 11:05 PM

న్యాయం చేయనందుకు సిగ్గుపడుతున్నా..

20-07-2024 01:49:03 AM

పాత్ర ఏదైనా తనదైన నటనతో ప్రాణం పోసే నటుల్లో బాలీవుడ్ నటుడు నవాజ్ ఉద్దీన్ సిద్ధిఖీ ఒకరు. బీటౌన్ విలక్షణ నటుడిగా పేరున్న ఆయన ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నేను డబ్బు సంపాదించేందుకు ఇండస్ట్రీలోకి రాలేదు. నటనపై ఇష్టంతోనే ఈ రంగంలో అడుగుపెట్టా. వచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేస్తున్నా.

అయితే, ‘రామన్ రాఘవ్’ లాంటి చిత్రాల్లో నటించినప్పుడు పాత్రకు సంబంధించి ఎమోషన్స్, థాట్స్‌పై నాకు పట్టుంది. దక్షిణాది చిత్రాల్లో మంచి పారితోషికం ఇస్తున్నారు కాబట్టే ఆయా పాత్రలు చేస్తున్నా. కానీ పాత్రకు న్యాయం చేయలేపోతున్నానేమోనని సిగ్గు పడుతున్నా. నేను ఏం చేయాలనే దాన్ని షూటింగ్‌కు ముందు ఓ వ్యక్తి వివరించాల్సిన పరిస్థితి నెలకొంది” అని చెప్పారాయన.  ‘సైంధవ్’తో తెలుగు వెండితెరపై నవాజ్ ఉద్దీన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.