calender_icon.png 22 September, 2024 | 3:08 AM

నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు!

22-09-2024 01:09:18 AM

నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది కొంత మంది బీఆర్‌ఎస్ నాయకుల తీరు. మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఇద్దరూ ఈ కోవలో కే వస్తారు. రాష్ట్ర ప్రజలు వారికి పదేళ్లు అ ధికారం కట్టబెడితే అప్పుడు పట్టించుకోలేదుగానీ, ఇప్పుడు ప్రతీ సమస్యను భూ తద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో ఆ సమ స్యలను పట్టించుకోని వాళ్లు ఇప్పుడు ప్రతీ దానికి స్పందిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను దాట వేసిన వీరు...గతంలో అసలు ఈ సమస్యలే లేవన్నంతగా స్పందిస్తున్నారు. ప్రెస్ మీట్‌లు పెట్టి ఒకరు...ట్విట్టర్‌లో మరొకరు..ఇలా సమస్యలను లేవనెత్తుతున్నా రు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చే యకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారనే చర్చ జనాల్లో జరుగుతోంది.