24-03-2025 12:18:13 AM
కరీంనగర్ క్రైమ్, మార్చి23 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద షహీద్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తాజా మాజీ మేయర్ సునీల్ రావు లు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు.
బిజెపి నాయకులు నాంపల్లి శ్రీనివాస్ , మాడ వెంకటరెడ్డి , బల్బీర్ సింగ్ , బండ రమణారెడ్డి, చొప్పర్ జయశ్రీ , బండారు గాయత్రి, వరల జ్యోతి,నరేందర్ ,పొన్నం మొండయ్య ,తణుకు సాయి, రాజు , గాజుల వేణుగోపాల్, రామకృష్ణారెడ్డి ,బొడ్ల శ్రవణ్, వంగ సంపత్, పిట్టల సుమంత్ ,వంశీ అనుదీప్, ధోలీ ఉపేందర్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.