calender_icon.png 25 October, 2024 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రి మైదానంలో ఎస్జీఎఫ్ క్రీడలు

29-08-2024 12:00:00 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు, ఆగస్టు 28: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో బుధవారం 68వ ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పటాన్‌చెరు నియోజకవర్గాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లితం డ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఎంఈవో రాథోడ్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, ఎస్జీఎఫ్ కార్యదర్శి గౌసుద్దీన్, నాయకులు అఫ్జల్, ప్రమోద్‌గౌడ్, వెంకటేశ్, మల్లారెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, ఇమ్రాన్ తదితరలు పాల్గొన్నారు.