- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- పోలీసుల అదుపులో నిందితుడు
కూకట్పల్లి, సెప్టెంబర్ 22: నడుస్తున్న బస్సులో ఓ వివాహతపై లైంగి క దాడి జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి సీఐ ముత్త కథనం ప్రకారం.. హిమాయత్ సాగర్ ప్రాంతానికి చెంది న ఓ వివాహిత ఈ నెల 18న ఏపీలోని సామర్లకోట వెళ్లేందుకు కూకట్పల్లి వై జంక్షన్ వద్ద మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కింది. బస్సు కదిలి చౌటుప్పల్ శివారు ప్రాం తానికి చేరుకోగానే బస్సు హెల్పర్ రెడ్డి సాయి కుమార్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సామర్లకోటలో బస్సు దిగిన మహిళ ఇంటికి వెళ్లి జరిగిన విషయా న్ని తల్లిదండ్రులకు చెప్పింది. 20న నగరానికి చేరుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసు లు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఆది వారం నింది తుడిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.