కామారెడ్డి(నిజామాబాద్), అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో ఎక్కించుకున్న నలుగురు దుండగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘట న శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా లో జరిగింది. శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ బస్టాం డ్ వద్ద శుక్రవారం రాత్రి ఒంటిరిగా ఉన్న సదరు మహిళను దుండగులు ఆటో లో ఎక్కించుకుని లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం డిచ్పల్లిలో వదిలి పరారయ్యా రు. శనివారం తెల్లవారుజామున నిజామాబాద్కు చేరుకున్న బాధితురాలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. బస్టాండ్ వద్ద సీసీటీవీ ఫుటేజీలో నమోదైన నిందితుల దృశ్యాలను పరిశీలించినట్లు తెలుస్తున్నది. కాగా నిందితులు డిచ్పల్లికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.