calender_icon.png 10 March, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ

10-03-2025 05:51:43 PM

ఆర్థిక స్వావలంబనతోనే మహిళల అభివృద్ధి సాధ్యం..

ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్త..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ఆర్థిక స్వలంబనతోనే మహిళల అభివృద్ధి సాధ్యమని ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్త అన్నారు. సోమవారం హైదరాబాదులో కామారెడ్డికి చెందిన పేద మహిళకు కుట్టు మిషన్ అందజేశారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును పేద మహిళ కుట్టు మిషన్ అందించాలని కోరగా ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్తాను సంప్రదించడంతో వెంటనే స్పందించి మనుగుల కుమారికి కుట్టుమిషన్ ను హైదరాబాద్ లో అందచేశారు. ఈ సందర్భగా డాక్టర్ బాలు మాట్లాడుతూ... మహిళల అభివృద్ధి ఆర్థిక స్వాలంబనతోనే సాధ్యమవుతుందని, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి మార్గాలతో ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు.

గతంలో కూడా మహిళల అభ్యున్నతి కోసం వారికి కుట్టుమిషన్లను అందజేసిన వందనపు శైలేష్ గుప్తాను సన్మానింఛీ అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహిళా నాయకురాలు ఉప్పల శారద మాట్లాడుతూ.... పేద మహిళ కోసం కుట్టు మిషన్ అందజేయడం శైలేష్ గుప్తాకు ఉన్న సామాజిక బాధ్యతకు నిదర్శనమని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పల శారదకు ప్రత్యేక కృతజ్ఞతలను శైలేష్ గుప్తా తెలియజేశారు.