జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): నగరంలోని సీవరేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ అన్నారు. శుక్ర వారం ఓఅండ్ఎం డివిజన్-3 పరిధిలోని గుడిమల్కాపూర్, నవోదయ కాలనీల్లో ఆయన పర్యటించి తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, సప్లు లెవల్స్, మురుగునీటి నిర్వహణ తదితర పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆపరేషన్స్ డైరెక్టర్-1 విజయరావు, జీఎం, డీజీఎం, మేనేజర్ పాల్గొన్నారు.