ఛత్తీస్ గఢ్,(విజయక్రాంతి): ఛత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపుర్ సరిహద్దులో మవోయిస్టులుసంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ, నారాయణపుర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి భారీ సంఖ్యంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా భద్రత బలగాలకు మవోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.