24-02-2025 10:49:46 AM
పాట్నా: బీహార్లోని పాట్నా(Patna Road Accident) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘనలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మసౌర్హి ప్రాంతంలోని నూరా వంతెనపై టెంపో, ట్రక్కు పరస్పరం ఢీకొని బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి. నూరా వంతెన సమీపంలో టెంపో, ట్రక్కు ఢీకొన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని మసౌర్హి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఢీకొనడం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. బాధితుల గుర్తింపును నిర్ధారిస్తున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.