13-11-2024 01:43:18 AM
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ప్రజాభవన్లో మంగళ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 748 దరఖాస్తులు వచ్చిన ట్టు అధికారులు తెలిపారు. మైనార్టీ వెల్ఫేర్ శాఖకు 420, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు 110, విద్యుత్శాఖకు 80, రెవెన్యూ పరమైన సమస్యలపై 59, మున్సిపల్ శాఖకు 14, ప్రవాసి ప్రజావాణికి 2, ఇతర శాఖలకు 63 దరఖాస్తులు అందినట్టు వివరించారు. ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించి అక్కడికి వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.