calender_icon.png 24 October, 2024 | 10:05 PM

ఏడు బైకులు దగ్ధం

29-07-2024 01:27:32 AM

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 28: పాత కక్షలతో 7 ద్విచక్ర వాహనాలకు నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్‌లోని జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం కాలనీలో నివాసం ఉండే మహేందర్ అనే వ్యక్తి, తన ద్విచక్ర వాహనం సీటును గతంలో విజయ్, జీవన్‌కుమార్ అనే ఇద్దరు ధ్వంసం చేశారనే అనుమానంతో వారి కక్ష పెంచుకున్నాడు. దీంతో అదే కాలనీలో ఉండే తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ చోట పార్కిం గ్ చేసిన విజయ్, జీవన్‌కుమార్ ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టాడు. మంటలు చెలరేగి మరో ఐదు బైక్‌లకు అంటుకున్నాయి. దీంతో ఏడు బైక్‌లు దగ్ధమయ్యాయి. బైక్‌లను దగ్ధం చేసిన వారిలో మొగిళ్ల మహేందర్, ఎజమదల శివతో పాటు మరో బాలురు ఉన్నారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.