calender_icon.png 24 October, 2024 | 12:45 PM

Breaking News

ఈగా దయాకర్ గుప్తకు సేవా వైభవరత్న అవార్డు

12-08-2024 08:25:11 PM

తుంగతుర్తి: సూర్యాపేటకు చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగ దయాకర్ గుప్తాకు సేవ వైభవరత్న అవార్డు వరించింది. వివిధ రంగాలలో సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం హైదరాబాద్ కు చెందిన శ్రీ  లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో అవార్డులు ప్రధానం చేస్తుంటారు. హరిహర కళ భవన్, సికింద్రాబాద్ లో సూర్యాపేటకు చెందిన ఈగా దయాకర్ గుప్త అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ... శ్రీ లలితా కళా సమితి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ప్రధానం చేసినట్లు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక, సామజిక సేవలు అందించిన సుమారు 120 మందికి సేవా వైభవ రత్న అవార్డులను ప్రధానం చేసి స్వర్ణ కంకణం, మెమెంటో, అవార్డు సర్టిఫికెట్, మెడల్, శాలువాతో సత్కరించినట్టు పేర్కొన్నారు. నా సామజిక సేవను గుర్తించి సేవా వైభవరత్న అవార్డు ప్రధానం చేసినందుకు శ్రీ లలితా కళా సమాఖ్యకి ధన్యవాదములు తెలిపారు. ఈ అవార్డు పొందినందుకు సమాజానికి ఇంకా సేవ చేసే భాద్యత పెరిగిందన్నారు. అవార్డు పొందటం తుంగతుర్తి మండలంకు చెందిన ఆర్యవైశ్యులు, మేధావులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.