calender_icon.png 10 March, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

03-03-2025 12:00:00 AM

ముఖ్యమంత్రికి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు 

సిద్దిపేట అర్బన్, మార్చి 2 ః పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ర్ట ముఖ్యమంత్రి కి లేఖ రాశారు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగింది అని సమయానికి రైతుబంధు తో పాటు  సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించాము.  సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాము. నాటి ప్రణాళికా బద్దంగా నేడు తెలంగాణ రాష్ర్టంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు.  ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్) పంట కోతకు వచ్చింది. 

సన్ ఫ్లవర్ గింజలను విక్రయించడానికి ఇప్పటిదాకా రాష్ర్టంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని. దీనివల్ల రైతులు రూ. 5,500 నుండి రూ. 6000 వరకు దళారులకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో  నాఫెడ్ ద్వారా సన్ ఫ్లవర్ నూనె గింజలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేశాము.  ఈసారి కూడా రూ. 7280 మద్దతు ధరను నాఫెడ్ ప్రకటించింది.  కానీ ఇప్పటిదాకా కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

దళారులకు విక్రయించడం వల్ల క్వింటాల్ కు రూ. 1000 నుండి రూ. 2000 వరకు నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి రైతులకు కలిగింది. వెంటనే రాష్ర్ట వ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నానని. నూనె పంటలు వేయాలంటేనే రైతులు ఆందోళన చెందే పరిస్థితులన ఏర్పడింది వెంటనే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు