calender_icon.png 11 October, 2024 | 2:53 PM

సొంతగడ్డపై జర్మనీతో సిరీస్

02-10-2024 12:00:00 AM

40 మందితో భారత హాకీ జట్టు

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్ జర్మనీతో రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం 40 మంది ప్రాబబుల్స్‌తో కూడిన భారత జట్టును ప్రకటించింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న క్యాంప్‌లో ప్రిపరేషన్‌కు సమయం కేటాయించారు.

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరగనున్న ప్రాక్టీస్ సెషన్ అనంతరం 40 మంది ప్రాబబుల్స్ నుంచి తుది జట్టును ఎంపిక చేయనున్నారు. 40 మందిలో నలుగురు గోల్ కీపర్స్, 12 మంది డిఫెండర్లు, 11 మంది మిడ్ ఫీల్డర్లు, 13 మంది ఫార్వర్డ్ ప్లేయర్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన హర్మన్‌ప్రీత్ సేన ఇటీవలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.