యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది అయిన సందర్బంగా ప్రధానమంత్రి మోడీ దేశ వ్యాప్తoగా లబ్ధిదారులకు చెక్కుల బహూకరణ కార్యక్రమం మహారాష్ట్రంలోని వార్ధాలో చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ లో దృశ్యవీక్షణ మాధ్యమంలో ప్రదర్శన చేశారు. భువనగిరి లో ఈ కార్యక్రమం శ్రీ టెక్నాలజీస్ ట్రైనింగ్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీ శివరామకృష్ణ, కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ అధికారులు, MSME స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీమతి శైలజ , పోస్టల్ శాఖ అధికారి శ్రీ సంతోష్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ శ్రీ శరత్, లబ్ధిదారులు, పిఎం విశ్వకర్మ ట్రైనీలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్స్ మరియు శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది.