వికారాబాద్ రూరల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లా అభ్కారి శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. 400 గ్రాముల గంజాయి చాక్లెట్స్తో పాటు 1.9 కిలోల ఎండు గంజాయి పౌడర్ను పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన అనిల్కుమార్ దాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు.