calender_icon.png 28 October, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

28-10-2024 06:16:46 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.రామ కళ్యాణి, వైస్ ప్రిన్సిపల్ కే.మహేశ్వర రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం క్రితం నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో లక్షెట్టిపేట గురుకుల విద్యార్థిని ఎస్. బ్లేస్సినా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 29 నుండి 30 వరకు గోదావరిఖనిలో నిర్వహిస్తారని పిఈటి మమత ఒక తెలిపారు. ఇట్టి విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించారు.