జెండా ఊపి బస్సులు ప్రారంభించిన అదనపు కలెక్టర్ భీమ్ల నాయక్
మూడు వాహనాల్లో తరలిన 130 మంది
కరీంనగర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ ల్ నియామక పత్రాలు అందజేయనుండగా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తరలివెళ్లారు. ఆరు బస్సుల్లో 300 మంది వరకు తరలి వెళ్లే వాహనాలను అదనపు కలెక్టర్ భీమ్ల నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద జెండా ఊపి కరీంనగర్ లో కలెక్టర్ పమెల్ల సత్పతి ప్రారంభించి ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు.