బైంసా (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని సిరిపెల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసుల తనిఖీల్లో రూపాయిలు 81,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై రవీందర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో 50 వేల విలువ కంటే ఎక్కువ నగదు ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నరసింహారెడ్డి అనే వ్యక్తి వద్ద నుండి దీన్ని స్వాధీనం చేసుకోగా దీనికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అధికారులకు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు.