శాంపిల్స్ను ల్యాబ్కు పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
సూర్యాపేట, సెప్టెంబర్ 25: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీమార్ట్ను బుధవారం జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతీర్మయి, జిల్లా ఫుడ్సేప్టీ అధికారి ఆర్ కిరణ్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీ మార్ట్లోని పలు ఆహార పదార్థాలను పరిశీలించారు. విడిగా ఉంచిన 20 కేజీల టీ పౌడర్లో కల్తీ ఉన్నట్లు అనుమానించి శాంపిల్స్ను ల్యాబ్ కు పంపించారు.
ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకు ంటామన్నారు. అలాగే ఆహార పదార్థాల్లో రంగు లు, హానీకరమైన రసాయనా లు ఉపయోగించరాద నియాజమాన్యానికి సూచిం చారు. నాణ్యత లేని, శుభ్రత పాటించని దు కాణాలపై ఫుడ్సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్ట ప్ర కారం చర్యలు తీసుకుంటుందని అధికారు లు తెలిపారు. అనంతరం స్థానికంగా ఏర్పా టు చేసిన ఫుడ్ సేప్టీ లైసెన్స్ మేళాలో పాల్గొన్నారు.