అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం“బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 26న థియేటర్లలోకి రానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్ర బృందం తాజాగా ‘ఫీల్ ఆఫ్ బడ్డీ పేరిట’ ఓ గీతాన్ని విడుదల చేశారు. ‘చూసాలే చూసాలే నీలో నా కలనే.. దాచాలే దాచాలే నాలో ఆ కలనే”అంటూ సాగే ఈ పాటని సాయి హేమంత్ రాయగా, స్వరకర్త అయిన హిప్ హాప్ తమిళ గాయకుడు ఐరా ఉడుపితో కలిసి పాడారు. టెడ్డీతో కలిసి శిరీష్ చేయనున్న పోరాటాలు, ఆ రెండు పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని రూపకర్తలు చెబుతున్నారు.