calender_icon.png 21 October, 2024 | 12:36 AM

సికింద్రాబాద్ బంద్ ఘటన.. ఐదు కేసులు నమోదు

20-10-2024 02:45:37 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ బంద్ ఘటనపై పోలీసులు ఐదు కేసులను నమోదు చేశారు. మెండా మార్కెట్, గోపాలపురం పీఎస్ ల్లో కేసులు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సులపై దాడి చేశారని ఆర్టీసీ డ్రైవర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద పోలీసులపై రాళ్లు, చెప్పులు, వాటర్ ప్యాకెట్స్, కుర్చీలు విసిరారని ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ ఫిర్యాదుతో 195, 192, 121, 132, 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, శనివారం సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అయితే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరకు నిరసనకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.