కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 30(30)ఏ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు పాటు జిల్లా వ్యాప్తంగా 30(30)ఏ పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ అధికారులు అనుమతి లేకుండా జిల్లాల్లో ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ సమావేశాలు సభలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్ట రాదని ఎస్పీ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు పోలీసులకు ఈ విషయంలో సహకరించాలన్నారు.