హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : హుస్సేన్సాగర్ బఫర్ జోన్లోని సచివాలయం, బల్దియాను కూల్చాలని ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నగరంలోని సచివాలయ ప్రధాన ద్వారం, జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎర్రటి అక్షరాలతో చేయించిన ‘బీఆర్ ఎక్స్’ స్టిక్కర్లను అంటించారు. అనంతరం ఆయనమ మాట్లాడుతూ.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలన్నారు. పేదలకు మాత్రమే కాదన్నారు.