calender_icon.png 15 March, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టుగా గుట్కా దందా..

15-03-2025 12:00:00 AM

నిర్లక్ష్యంగా అధికారులు.గుట్కాకు కేరాఫ్ కిరాణం, పాన్ డబ్బాలు 

రాజకీయ నాయకుల అండదండలతోనేనా..

లక్షెట్టిపేట, మార్చి 14 (విజయక్రాంతి) : నిషేధిత గుట్కా మండలంలోని వివిధ గ్రామాలలో   యథేచ్ఛగా సాగుతున్నాయి. చాప కింద నీరులా ప్రజారోగ్యాన్ని గుట్కా మహమ్మారి పట్టిస్తుంది. యువత గుట్కా కు బానిసై క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోని ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం గుట్కా విక్రయాలు ను బ్యాన్ చేసిన కొందరు అక్రమార్కులు క్రయ విక్రయాలు చేపడుతున్నారు. పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. కిరాణా, పాన్ డబ్బులు, హోటల్ లక్ష్యంగా విక్రయాలు చేపడుతున్నారు.  మండలాల్లోని గ్రామాలలో మూడు పువ్వులు ఆరు కాయలుగా గుట్కా వ్యాపారం కొనసాగుతోంది.

ఈ దందాలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. అధికారుల తనిఖీలు నామమాత్రంగా చేపట్టడంతోనే వ్యాపారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గుట్కా వ్యాపారుల నుంచి అధికారులు నెల వారి మామూళ్లు ముడుతుండ డంతోనే చూచి చూడనట్టుగా వ్వవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యానికి హాని చేసే గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్చిన అవసరం ఎంతైనా ఉంది.

నిషేధం విధించినా...

ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గుట్కాపై నిషేధం విధించింది. యువత మొదలుకొని వృద్ధుల వరకు గుట్కా తినడంతో క్యాన్సర్ తో పాటు వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుట్కా, పాన్ మసాలా పై ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. కానీ, కొంతమంది రాజకీయ పలుకుబడితో ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినప్పటికీ కిరాణం, హోటల్, పాన్ షాపుల్లో విచ్చలవిడిగా గుట్కాను విక్రయిస్తున్నారు.  పట్టణంలో గుట్కా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.  మున్సిపాలిటీలోని ప్రతి కిరాణా దుకాణంలో గుట్కా ప్యాకెట్లు ఉంటాయి. కానీ కిరాణా దుకాణం యజమానులు దొరకనివ్వకుండా దాచిపెడతారు. హోటల్, పాన్ షాపుల్లో బహిరంగంగానే అమ్ముకుంటున్నారు. 

గుట్కాకు బానిసవుతున్న యువత... 

గుట్కాకు అధిక సంఖ్యలో యువత బానిస అవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నోట్లో గుట్కా, పాన్ మసాలా లేకుండా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వం నిషేధం విధించడంతో రూ. 10 గుట్కను రూ. 20 రూపాయల చొప్పున దుకాణాలు, పాను డబ్బాల్లో యథేచ్ఛగా గుట్కా విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. చాలామంది గుట్కా తినడం తో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం బ్యాన్ చేసిన కూడా ఇప్పటికీ పలుచోట్ల కిరాణా షాప్ లో లభిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టి కట్టుదిట్టమైన చర్యలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.