పెద్దపల్లి: రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం జూలై 30వ తేదీన ఉదయం 11:45 నిమిషాలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం తెలిపారు. రేపు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతులకు లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులు రైతులు, ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.