calender_icon.png 23 October, 2024 | 8:51 PM

మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహాయకుడి ఇంట్లో సోదాలు

29-07-2024 12:54:18 AM

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణ

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శశిధర్ నివాసంలో తనిఖీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లు దహనం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అనుమాని తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్‌పై దృష్టి సారించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని శశిధర్ నివాసంలో మాదాపూర్ పోలీసులకు సమాచారమిచ్చి సీఐ రమేశ్ ఆధ్వ ర్యంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించారు. భారీగా ఫైళ్లను గుర్తించిన పోలీ సులు నాలుగు బాక్సుల్లో వాటిని ఆంధ్రప్రదేశ్‌కి తరలించారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శశిధర్ నివాసం ఉంటున్నారు. పోలీసులు సోదాలకు వచ్చిన సమయంలో శశిధర్ ఇంట్లో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పిలిచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.