calender_icon.png 24 October, 2024 | 11:55 AM

పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి

29-07-2024 01:21:28 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, జూలై 28(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేటలోని ఏకలవ్య విద్యాలయాన్ని ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని తరగతి గదులు, మైదానం, డైనింగ్ హాల్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వీర్నపల్లి మండలం రంగంపేట ప్రభుత ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం.. వీర్నపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సీసీ రోడ్డు  పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు తరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మండల విద్యాధికారి రుఘుపతికి, అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.