calender_icon.png 20 September, 2024 | 3:38 AM

భయపెడుతున్న సంక్షేమ హాస్టళ్లు

11-07-2024 12:00:00 AM

కామిడి సతీష్‌రెడ్డి :

ఏ ఒక్క వసతిగృహంలో జనరేటర్, ఇన్వర్టర్ బ్యాటరీ సౌకర్యం లేదు. రాత్రిళ్లు వర్షాలు, గాలి దుమారాలవల్ల సంభవించే కరెంట్ కోతలతో విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు దోమల బెడదతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా విద్యార్థులు దోమకాటుతో అనారోగ్యం భారిన పడుతున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వున్న సంక్షేమ హాస్టల్‌లలో విద్యను అభ్యసిస్తూ వున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు నెల రోజులు అవుతూ ఉంది. గడచిన ఏడు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో కొన్ని మరణాలవల్ల విద్యార్థులు భయకంపితు లు అవుతున్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఇతరేతర అనారోగ్య సమస్యలు, క్షేత్రస్థాయిలో కొరవడిన ఉన్నతాధి కారుల పర్యవేక్షణ.. మొత్తంగా రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల పరిస్థితి ఇదీ. లక్షలమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ఈ వసతి గృహాలలో విద్యార్థులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ, కస్తూర్బా పాఠశాలల వసతి గృహాల పరిస్థితి మరీ అధ్వానంగా మారిం ది. అపరిశుభ్రమైన పరిసరాలతో సీజన్‌లో అంటువ్యాధులు, విషజ్వరాలు చుట్టుముట్టి తరచుగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. 

పర్యవేక్షణా లోపం

పోయిన ఏడాది వనపర్తి జిల్లాలో వారం క్రితం నాటి కలుషిత ఆహారం తినడం వల్ల ఎంతోమంది కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రు. దీనినిబట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తున్నది. వసతి గృహాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లి దండ్రులు కూడా పిల్లలను వసతిగృహాలకు పంపేందుకు వెనుకాడుతున్నారు. ఏ చిన్న జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురై నా ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపో వడంతో కిందిస్థాయి సిబ్బంది విద్యార్థుల సంక్షేమాన్ని గాలి కొదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అన్ని జిల్లాలలో వం దలాది ఆశ్రమ పాఠశాలలు ఉండగా, వాటిల్లో లక్షలమంది విద్యార్థులు చదువుకుంటు న్నారు. వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు స్థానికంగా ఉం డక పోవడంతో కొన్నిచోట్ల విద్యార్థులే హాస్టళ్లను నిర్వహించుకుంటూ చదువులు కొనసాగిస్తున్నారు. మరి కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే వసతి గృహాలు కొనసాగుతున్నాయి. అలాగే, సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

దాదాపుగా అన్ని వసతి గృహాలలో పడక మంచాలు లేవు. దీంతో విద్యార్థులు నేలపైనే కునుకు తీయాల్సి వస్తున్నది. పలు వసతి గృహాలకు ప్రహరీలు, కంచెలు లేనందున పందులు, కుక్కలు పరిసరాల్లో స్తురై విహారం చేస్తూ కనిపిస్తున్నాయి. ఏదై నా చిన్నపాటి జ్వరం వచ్చినా విద్యార్థులకు ఔషధాలు ఇచ్చే నాథుడే కరువవుతున్నా డు. ఈ పరిస్థితుల్లో వార్డెన్‌లే తమకు తెలి సీ తెలియని వైద్యం చేస్తున్నారు. వార్డెన్ ఇచ్చిందే మందు గోలిగా మారుతుంది. సకాలంలో సరై న వైద్యం అందక పరిస్థితి విషమించడంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. 

చేతులు కాలాక ఆకులు..

విద్యార్థుల ఆరోగ్యం పట్ల వసతిగృహాల్లో నిండు నిర్లక్ష్యమే కనిపిస్తుంది. నెలనెలా వైద్య పరీక్షలు నిర్వహించక పోవ డంతో ప్రాణాంతక వ్యాధుల భారిన పడి పలువురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనే ఆరోపణలు విన వస్తు న్నాయి. ఏ ఒక్క వసతిగృహంలో జనరేటర్, ఇన్వర్టర్ బ్యాటరీ సౌకర్యం లేదు. రాత్రిళ్లు వర్షాలు, గాలి దుమారాలవల్ల సంభవించే కరెంట్ కోతలతో విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు దోమల బెడదతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా విద్యార్థులు దోమకాటుతో అనారోగ్యం భారిన పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, అంటువ్యాధులు వారిని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బాలికల వసతి గృహా లలో చెప్పుకోలేని ఇబ్బందు లతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. ఏదైనా ఆపద వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం వసతి గృహాల్లో ఉంటూ చదువు కుంటున్న విద్యార్థుల ప్రాణాలు పోయిన సందర్భాలు ఉ న్నాయి. సంబంధిత అధికారులకు పట్టింపే లేకుండా పోయిందన్న విమర్శలూ వస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారుల తీరు మారిందంటున్నారు.

మెనూ ఉన్నా, పెట్టిందే తినాలా?

గత ఏడాది ఆరుగురు పిల్లల మృతి వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే ప్రా ణాలు పోయేవి కాదనీ వారు వాపోయా రు. పెట్టిందే తినాలంటూ బెదిరిం పులకు గురి చేస్తూ వసతి గృహాల్లో అధికారుల ఇష్టారాజ్యం కనిపిస్తున్నది. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం కాకుండా పెట్టిం దే తినాలంటూ విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉడికీ ఉడకని అన్నం, పప్పు నీళ్ల చారును తినేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు.

ఒక వేళ ఆకలిని తట్టుకోలేక ఎంతో కొంత తిన్నా తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు నిద్రలేమి సమస్యతో చదువులపై దృష్టి సారించడం లేదు. గోడలపై మెనూ కనిపిస్తున్నా అది ఎక్కడా అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నా రు. నాణ్యమైన భోజనాన్ని అందించక పో వడంతోనే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నా రు. అసలే గిరిజన విద్యార్థులను రక్తహీనత సమస్య వెంటాడుతుంది. దీనికి తోడు నాణ్యమైన భోజనం అందించక పోవడంతో భయంకర వ్యాధులు చుట్టుముడు తున్నాయి. కొందరు వసతిగృహాల అధికారులు నిత్యావసర సరుకుల సరఫరా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

నిరంతర తనిఖీలతోనే పరిష్కారం

విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్లపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై నిరంతరం ఉన్నతాధికారులు నిఘా సారించక పోవడంతోనే విద్యార్థులకు సరై న వసతులు అందడం లేదని తెలుస్తున్నది. ఇలాంటి వాటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించినప్పుడే పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యావకాశాలు అందే అవకాశం ఉం టుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిని 36 మంది విద్యార్థులు ఆనారోగ్యంతో బాధ పడుతూ వివి ధ ఆసుపత్రులలో చికిత్స పొందారు.

గత సంవత్సరం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ హాస్టల్‌లో అయిదవ తరగతి విద్యార్థి సాయిరాజ్ పాముకాటుతో మరణించడం అందరినీ కలచి వేసింది. సమీప అడవుల నుండి తలుపు సందుగుండా కట్లపాము లోపలికి వచ్చి కాటు వేసిందని తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని రకాల సంక్షేమ హాస్టళ్లను ఆయా జిల్లాల పాలనాధికారులు నిరంతరం తనిఖీలు చేసి సమ స్యలు పరిష్కరించాల్సి ఉంది. ఇకనైనా ప్ర భుత్వం తక్షణమే స్పందించి ఆయా వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 వ్యాసకర్త సెల్: 9848445134