calender_icon.png 20 September, 2024 | 2:22 PM

ఎస్సీ, ఎస్టీ పెండింగ్ కేసులు పరిష్కరించాలి

20-09-2024 11:29:56 AM

యాదాద్రిభువనగిరి,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ  సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు రవి కిరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, సంబంధిత కమిటీ అధికార, అనధికార మెంబర్లు పాల్గొన్నారు.