18-03-2025 05:45:29 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(LB Nagar MLA Sudheer Reddy)పై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసు(SC/ST Atrocities Case) నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్(Hasthinapuram Corporator Banothu Sujatha Nayak)పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే డి. సుధీర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్(Congress Leader Madhu Yashki Goud)తో హస్తినాపురం కార్పొరేటర్ కు హనీమూన్ నడుస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ పోలీసులు సుధీర్ రెడ్డిపై క్రిమినల్ నంబర్ 254/2025 కింద కేసు నమోదు చేశారు. 1989 ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్లు 3(2)(వీఎ), 3(1)(ఆర్)(డబ్ల్యూ)(ii), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తర్వాత, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించి, ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
SC/ST Atrocities Case Filed Against LB Nagar MLA Sudheer Reddy