calender_icon.png 28 September, 2024 | 4:49 PM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న నన్నే అవమానించారు..

28-09-2024 02:40:52 PM

మెదక్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న నన్నే జిల్లా అధికారులు అవమాన పరిచారని బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా కుల బహిష్కరణలు, సాంఘిక అసమానతలు కొనసాగడంపై విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు.

శనివారం మనోహరాబాద్ మండలం గౌతమి కూడా గ్రామంలో కుల బహిష్కరణకు గురైన ఘటనపై గ్రామానికి వెళ్లి అవగాహన సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మెదక్ కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు భూ సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత రెండు రోజుల క్రితం జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో తనకు ప్రోటోకాల్ పాటించలేదని జిల్లా కలెక్టర్ ఎందుకు పూర్తి బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.