calender_icon.png 27 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బంగ్లాదేశ్‌లో హిందువులను రక్షించండి

13-08-2024 03:20:36 AM

వికారాబాద్ రూరల్/ఎల్బీనగర్, అగస్టు 12 (విజయక్రాంతి): బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల మార్పుకోసం కాకుండా కేవ లం హిందువులను హతమార్చేందుకే దాడు లు జరుగుతున్నాయన్న అనుమానం కలుగుతుందన్నారు. 

ఆ దాడులను ప్రపంచ దేశా లు ఖండిచాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మరక్షన సమితి ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి మద్దుతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.