calender_icon.png 28 October, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయికుంట చెరువును కబ్జా నుంచి కాపాడండి

28-08-2024 03:28:43 AM

ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు

మంచిర్యాల, ఆగస్టు 27 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని సాయికుంట చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలని ఐక్య కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు సల్మాన్ పాషా, గోపాల్, వంశీ, సతీష్, శివతేజ, అఖిల్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఒకవైపు చెరువులను కాపాడాలని చూస్తుంటే, ఇరిగేషన్ అధికారుల సహకారంతో కొందరు సాయికుంట చెరువు కబ్జా చేస్తున్నారని మండిపడ్డా రు. అధికారులు విచారణ చేపట్టి కబ్జాకు పా ల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చే యాలని డిమాండ్ చేశారు.