కర్ణాటక వైద్యశాఖ మంత్రి
బెంగళూరు, అక్టోబర్ 3: వీర సావర్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరువునష్టం కేసు ఎదుర్కొం టుండగా, అదే పార్టీకి చెందిన మరో నేత కొత్త వివాదానికి తెరలేపారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్ గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘వినాయక్ దామోదర్ సావర్కర్ ఒక బ్రా హ్మణుడు. కానీ, ఆయన గోమాంసం తిన్నాడు. ఆయన మాంసాహారి.
గోహత్యలను ఆయన ఎన్నడూ వ్యతిరేకించ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ అంశంపై ఆయన ఎంతో ఆధునిక భావాలు కలవాడు. సావర్కర్ పెట్టుబడిదారీ విధా నలను అవలంభించారు. మహాత్మాగాంధీ ప్రజాస్వామికవాది. హిందూ ధర్మంపై అపారమైన విశ్వాసం ఉన్న గాంధీ పూర్తిగా శాఖాహారి’ అని పేర్కొన్నారు. గుండురావ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఆర్ అశోక్ మండిపడ్డారు.