calender_icon.png 17 October, 2024 | 6:45 PM

మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ..

17-10-2024 04:16:34 PM

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పట్టణానికి చెందిన మీసేవ నిర్వాహకుడు మంచిర్యాల జిల్లా మీసేవ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం హైదరాబాద్ లోని అబిడ్స్ లోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ ఆయనను ఘనంగా  సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మీసేవ నిర్వాహకుల అన్ని రకాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గంలో తనకు అవకాశం కల్పించిన తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భైరి శంకర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ మొహీద్, కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర మీసేవ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా నుండి మరో మీసేవ నిర్వాహకుడు కొంపల్లి సతీష్ కు రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యుడిగా ఎన్నుకోవడం ద్వారా జిల్లా ప్రాతినిధ్యం మరింత పెరిగిందని అన్నారు. ఇదిలా ఉండగా సత్యనారాయణ సేవలను గుర్తించి మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కార్య వర్గంలోకి తీసుకోవడం పట్ల పలువురు మీ సేవా నిర్వాహకులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.