హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో రానున్న చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సి.ప్రేమ్కుమార్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. “సత్యం సుందరం’ కార్తీ, అరవింద్ స్వామి క్యారెక్టర్స్ అనుబంధం ఏమిటి? ఒక్క నైట్లో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగిందనేది స్టొరీ.
-కార్తీ, అరవింద్ స్వామి.. ఇద్దరిలో ఎవరు అంగీకరించకపోయినా ఈ మూవీ చేసేవాడిని కాదు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఇద్దరూ ఈ కథను ముందు ముందు నవల రూపంలో చదివారు. దాన్ని స్క్రిప్ట్గా మలచడం వెరీ ఈజీ. నవల కూడా సినిమా స్క్రిప్ట్ స్ట్రక్చర్లోనే రాశాను. -సూర్య గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి తెలుగు ఆడియన్స్ చాలా ఇష్టపడతారు” అని వివరించారు.