calender_icon.png 25 October, 2024 | 5:51 AM

ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహం

12-08-2024 02:26:11 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): ట్యాంక్‌బండ్‌పై త్వరలో సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం జై గౌడ్ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం.. సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఆయన మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని.. ఆయన బాటలో బహుజనులు, గౌడ కులస్తులు నడవాలని పిలుపు నిచ్చారు. కార్యక్ర మంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్  పాల్గొన్నారు.