calender_icon.png 5 October, 2024 | 4:49 PM

ప్రజారోగ్యంపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ

05-10-2024 01:07:20 AM

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి 

కరీంనగర్, అక్టోబరు 4 (విజయక్రాంతి): ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన 81 మంది లబ్ధిదారులకు సీఎంఆ ర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.21.90 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలం దించే  దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తోంద న్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు ఎల్కపెల్లి సంపత్, సముద్రాల లక్ష్మణ్, పోలు రాము, పోలు రమేశ్, రెడ్డిగాని రాజు, బండారి రమేష్, ఎలుక రాజు, బుదారపు శ్రీనివాస్, జొన్నగడ్డల లింగయ్య, నగునూరి శ్రీనివాస్, మార్క నర్సయ్య పాల్గొన్నారు.