మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఘట్కేసర్, సెప్టెంబర్ 25: రాష్ట్రప్రభుత్వం అర్హులైన రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ వర్తింపజేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఘట్కేసర్లో బుధవారం నిర్వహించిన రైతు సేవా సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు.
రైతులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రభుత్వం ప్రకటించిన హామీలనే నేరవేర్చమని అడుగుతున్నారని స్పష్టం చేశారు. ఘట్కేసర్లో పోలీస్ పహారాలో రైతుల సమావేశం పెట్టడం సమంజసం కాదన్నారు. అంతకు ముందు రుణమాఫీ వివాదంపై బీజేపీ, అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో సమావేశం రసాభాసగా మారింది.