calender_icon.png 6 October, 2024 | 8:44 PM

సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీ సందర్శించిన రాష్ట్ర అధికారి

06-10-2024 06:51:21 PM

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఈఎస్ఐ డిస్పెన్సరీని రాష్ట్ర కార్మిక, ఉపాధి,శిక్షణ మరియు ఫ్యాక్టరీల ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ ఆదివారం సందర్శించారు. అనంతరం డిస్పెన్సరీలో అందుతున్న సేవలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐటిసి పిఎస్పిడి ఐఎన్టియుసీ, టిఎన్టిఎసీ మిత్రపక్షాల నాయకులు యారం పిచ్చిరెడ్డి, గొనె రామారావు, కనకమేడల హరిప్రసాద్ మర్యాదపుర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ పరిధిలో దాదాపు 30 వేలకు పైన కార్మికులు ఆధారపడి ఉన్నారని, సారపాకలో ఈఎస్ఐ శాశ్వత బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని, 24 గంటలు వైద్య సేవలు అందే విధంగా డాక్టర్స్ ఉంచాలని, అలాగే అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, భద్రాచలంలో  ప్రముఖ ఆసుపత్రులకు అనుసంధానం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు  ఉర్లుగొండ వీరన్న, ఇతర కాంట్రాక్టు కార్మిక సంఘాలు నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.