నిర్మల్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): నాగ్పూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిర్మల్ జిల్లా కడ్తాల్ సమీపంలో శని వారం ఉదయం సంత్రాలు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు సంత్రాల లోడ్తో వెళ్తున్న లారీ కడ్తాల్ గ్రామ సమీపంలో బోల్తా పడటంతో పండ్లు రోడ్డుపై పడ్డాయి. స్థానికులు వాహ నం పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకోనే లోపు చాలావరకు పండ్లు తీసుకెళ్లిపోయారు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో పోలీసులు అతన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.