calender_icon.png 5 October, 2024 | 1:05 PM

మూడు ఉద్యోగాలు సాధించిన సంతోష్

05-10-2024 01:03:27 AM

హుజూరాబాద్, అక్టోబరు 4: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండ లం ఎలబోతారం గ్రామానికి చెంది న కొండపర్తి సంతోష్ ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ-2024 ఫలితా ల్లో 78.53 శాతం మార్కులతో లాంగ్వేజ్ పండిట్ తెలుగులో కరీంనగర్ జిల్లా మొదటి ర్యాంకు సాధిం చాడు. 74.53 మార్కులతో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కరీంనగర్ జిల్లా 5వ ర్యాంకు సాధించాడు.

గతంలో గురుకుల టీజీటీ ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం సైదాపూర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఒకే ఏడాదిలో మూడు ఉద్యోగాలు సాధించాడు. సంతోష్‌ది నిరుపేద కుటుంబం కావడంతో చదువుకుం టూ తల్లిదండ్రులతో కలిసి వ్యవసా య పనులకు వెళ్లేవాడు.

మూడు సంవత్సరాల క్రితం సంతోష్ తల్లి కొండపర్తి రామ మ్మ అనారోగ్యం తో మృతిచెందింది. అయినప్పటికీ ఆత్మస్థుర్యైం, పట్టుదలతో చదివి ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించ డంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.