హుజురాబాద్, విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలా బోతారం గ్రామానికి చెందిన కొండపర్తి సంతోష్ ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ 2024 ఫలితాలలో 78.53 మార్కులతో లాంగ్వేజ్ పండిట్ తెలుగు లో కరీంనగర్ జిల్లా ఫస్ట్ ర్యాంక్, 74.53 మార్కులతో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కరీంనగర్ జిల్లా 5వ ర్యాంకు సాధించాడు. గతంలో గురుకుల టిజిటి ఫలితాలలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం సైదాపూర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఒకే ఏడాదిలో మూడు ఉద్యోగాలు సాధించాడు. సంతోష్ది నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులతో కలిసి చదువుకుంటూ వ్యవసాయ పనులు వెళ్లేవాడు మూడు సంవత్సరాల క్రితం సంతోష్ తల్లి కొండపర్తి రామమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అయినప్పటికీ ఆత్మశైర్యంతో పట్టుదలతో చదివి ఒకేసారి మూడు ఉద్యోగాలు సంపాదించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.