09-03-2025 08:24:45 PM
ప్రజాప్రతినిధులు, నాయకులను కలిసిన కమిటీ సభ్యులు
ఎల్బీనగర్: సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాదళ్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ నూతన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన కమిటీ సభ్యులు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, కమిటీకి సహకరించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన అధ్యక్షుడు రాంబాబు నాయక్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కమిటీ గౌరవ అధ్యక్షులు గన్న నాయక్, చందు నాయక్, అధ్యక్షుడు రామకోటి నాయక్, ఉపాధ్యక్షులు సూర్య నాయక్, అమర్సన్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్ నాయక్, ప్రధాన కార్యదర్శి భరత్లాల్ నాయక్, కోశాకాధికారి రామ్ నాయక్, సహాయ కార్యదర్శి రవి నాయక్, నిర్వాహక కార్యదర్శి రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.